Visakha Express: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో నీళ్లు నిల్‌.. కట్టలు తెంచుకున్న ప్రయాణికుల ఆగ్రహం

విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (Visakha Express) బోగీల్లో నీటి సరఫరా లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌.. బయలుదేరినప్పటి నుంచి నీటి సరఫరా లేదు. ఈ సమస్యను అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు. ఈ ఉదయం విశాఖపట్నం స్టేషన్‌కి చేరుకోగానే రైలు ఆపేసి అధికారులతో వాగ్వాదానికి దిగారు. కనీస నిర్వహణ లేకపోవడం, దాన్ని పట్టించుకోకపోవడం ఇటీవల కాలంలో తరచుగా జరుగుతోందని మండిపడ్డారు. అయితే, విశాఖ రైల్వేస్టేషన్‌ (vizag railway station)లో కూడా అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మెలో ఉండటం వల్ల.. నీళ్లు నింపకుండానే రైలు బయలుదేరింది.

Updated : 07 Apr 2023 14:27 IST

Tags :

మరిన్ని