Road Accident: మద్యం మత్తులో కారుతో బైక్‌లను ఢీకొట్టిన ఫ్రొఫెసర్

మద్యం మత్తులో కారుతో నాలుగైదు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన ఫ్రొఫెసర్‌ను నాసిక్  పోలీసులు అరెస్ట్ చేశారు. నాసిక్‌లోని ఓ కళాశాలలో కామర్స్ ఆచార్యుడిగా పనిచేస్తున్న సాహెబ్ రావు నికమ్.. జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. మందులు వాడినా దగ్గు తగ్గకపోవడంతో బ్రాందీ తాగితే తగ్గుతుందని ఓ స్నేహితుడు ఆయనకు సలహా ఇచ్చాడు. బ్రాందీ తాగిన సాహెబ్ రావు.. మద్యంమత్తులో కారు నడుపుతూ రోడ్డుపై వాహనదారులను ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన వాహనదారుల్లో ఒకరు రెండు కాళ్లూ కోల్పోయారు. అదేవేగంతో కారు నడుపుతూ డివైడర్‌ను ఢీకొట్టిన ప్రొఫెసర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 

Published : 21 Nov 2022 16:37 IST

Tags :

మరిన్ని