ED: పూరి జగన్నాథ్, చార్మిని విచారిస్తున్న ఈడీ అధికారులు
ప్రముఖ దర్శకుడు, నిర్మాత పూరి జగన్నాథ్, నటి చార్మిని ఈడీ అధికారులు ఉదయం నుంచి విచారిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఓ చిత్రానికి సంబంధించి పెట్టుబడుల వ్యవహారంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలపై ఇద్దరికీ వారం క్రితం నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొనడంతో.. ఉదయం 8గంటలకు పూరి జగన్నాథ్, చార్మి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. దాదాపు 12 గంటలుగా విచారణ కొనసాగుతోంది.
Updated : 17 Nov 2022 20:46 IST
Tags :