Delhi Liquor Scam: దిల్లీ మద్యం కుంభకోణం.. హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఈడీ సోదాలు

దిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ అధికారుల సోదాల పరంపర కొనసాగుతోంది. మరోసారి హైదరాబాద్‌లో ఈడీ అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లో దర్యాప్తు బృందం సోదాలు చేసింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ బోయిన్ పల్లి.. ఆంగ్ల మాధ్యమ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించిన ఈడీ.. జూబ్లీహిల్స్‌లోని ఆంగ్ల మీడియా సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది

Published : 08 Oct 2022 12:58 IST

Tags :

మరిన్ని