Eetala: భాజపా కార్యకర్తల రక్తాన్ని కళ్ల చూసి పార్టీని బతికించుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు: ఈటల
కేసీఆర్ సర్కారు ప్రజల విశ్వాసం కోల్పోయిందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఏ ప్రభుత్వమూ ప్రజాప్రతినిధుల ఇళ్లపై నీచంగా దాడులకు పాల్పడదన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ పైన దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఎంపీ అరవింద్ ఇంటిపై దాడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, అమిత్ షాకు లేఖ రాస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు రక్షణ కల్పించడంలో కేసీఆర్ సర్కారు విఫలమైందని ఆరోపించారు. సమాజాన్ని అల్లకల్లోలం చేయాలని తెరాస చూస్తోందని దుయ్యబట్టారు. భాజపా కార్యకర్తల రక్తాన్ని కళ్ల చూసి పార్టీని బతికించుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రజలపైనే దాడులు చేస్తున్నారన్నారు. తెరాస ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.
Published : 19 Nov 2022 15:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి