Elephant: జనావాసాల్లో ఏనుగు బీభత్సం..!

తమిళనాడు మేఘామలై (Megamalai) అటవీ ప్రాంతంలో ఓ ఏనుగు (Elephant) బీభత్సం సృష్టించింది. స్థానికంగా టీ పంటను సాగుచేసే కార్మికులపై గజరాజు దాడికి యత్నించినట్లు తెలిసింది. అక్కడకు చేరుకున్న అటవీ అధికారులు ఏనుగును బంధించేందుకు యత్నించి విఫలం అయ్యారు. అనంతరం ఆ గజరాజు కుడలూర్ ప్రాంతంలోని కొబ్బరి తోటలోకి ప్రవేశించి స్థానికులను భయ భ్రాంతులకు గురి చేసింది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటి ముందు ఉన్న ఓ వృద్ధురాలికి గజరాజు హాని చేయకుండా వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించింది.

Published : 27 May 2023 15:19 IST

తమిళనాడు మేఘామలై (Megamalai) అటవీ ప్రాంతంలో ఓ ఏనుగు (Elephant) బీభత్సం సృష్టించింది. స్థానికంగా టీ పంటను సాగుచేసే కార్మికులపై గజరాజు దాడికి యత్నించినట్లు తెలిసింది. అక్కడకు చేరుకున్న అటవీ అధికారులు ఏనుగును బంధించేందుకు యత్నించి విఫలం అయ్యారు. అనంతరం ఆ గజరాజు కుడలూర్ ప్రాంతంలోని కొబ్బరి తోటలోకి ప్రవేశించి స్థానికులను భయ భ్రాంతులకు గురి చేసింది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటి ముందు ఉన్న ఓ వృద్ధురాలికి గజరాజు హాని చేయకుండా వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించింది.

Tags :

మరిన్ని