AP news: దేవాదాయ శాఖలో కుర్చీల పోరు.. ఒకే స్థానంలో ఇద్దరు అధికారిణులు..!
దేవాదాయ శాఖలో కుర్చీల పోరు నడుస్తోంది. ఇద్దరు జిల్లా స్థాయి అధికారిణుల మధ్య పేచీ వచ్చింది. ఒకే స్థానంలో ఇద్దరూ విధులకు హాజరువుతుండటం దేవాదాయశాఖలో చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ జిల్లాలోని నెమలి వేణుగోపాలస్వామి ఆలయ ఈవో శాంతి, అదే జిల్లా దేవాదాయశాఖ ఇన్ఛార్జ్ అధికారిణిగా బాధ్యతలు చూస్తున్నారు. వేరే చోటికి బదిలీ చేసినా.. వెళ్లడం ఇష్టంలేక ఆమె ఎన్టీఆర్ జిల్లాలోనే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. మరో వైపు శ్రీకాకుళం డీఈవో అన్నపూర్ణను శాంతి స్థానంలో సర్దుబాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇద్దరూ ఒకేచోట విధులు నిర్వహిస్తున్నారు. ఇరువురు అధికారులు ఒకే గదిలో ఉండటంతో ఎవరి మాట వినాలో తెలియక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.
Updated : 25 May 2023 15:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM