Andhra news: వైఎస్ఆర్‌ కుటుంబం రాజకీయాల నుంచి వైదొలగాలి: మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుటుంబం రాజకీయాల నుంచి వైదొలగాలని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్‌ వివేకా హత్య కేసు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయినందుకు సిగ్గుపడాలన్నారు. వైఎస్ కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్నందునే ఏపీలో విచారణ సరిగా  జరగలేదని ఆరోపించారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు పారదర్శకంగా చేయాలని కోరారు. 

Updated : 30 Nov 2022 13:25 IST
Tags :

మరిన్ని