Alluri Sitaramaraju: పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహం పెట్టాలి: అల్లూరి వారసులు

ఇప్పటివరకు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుందంటూ అల్లూరి వారసులు కృతజ్ఞతలు తెలిపారు. అల్లూరి విగ్రహావిష్కరణ సందర్భంగా.. ఆయన వారసులు భీమవరం చేరుకున్నారు. 125 ఏళ్ల జయంతి ఉత్సవాలకు తమను ఆహ్వానించడం పట్ల సంతోషాన్ని వ్యక్తంచేశారు. పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహాన్ని పెట్టేలా చొరవ తీసుకోవాలని ప్రధానిని కోరతామంటున్నారు. 

Published : 04 Jul 2022 11:29 IST

Tags :

మరిన్ని