Fake currency: పేదలకు పంపిణీ చేసిన పింఛన్ల సొమ్ములో నకిలీ నోట్లు..!

పేదలకు పంపిణీ చేసిన పింఛన్ల సొమ్ములో నకిలీ నోట్లు కలకలం రేపాయి. ప్రకాశం జిల్లా  యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఎస్సీ కాలనీలో ఇంటింటికీ వెళ్లి వాలంటీరు పింఛన్లు పంపిణీ చేశారు. ఓ లబ్ధిదారు పింఛను నగదుతో లావాదేవీ చేస్తుండగా నకిలీ నోటును గుర్తించారు. ఈ విషయాన్ని వాలంటీరు దృష్టికి తీసుకురాగా.. పంపిణీ సొమ్ములో మరిన్ని నకిలీ నోట్లు కనిపించాయి. 

Updated : 01 Jan 2023 15:05 IST

Tags :

మరిన్ని