Anantapur: కలెక్టరేట్ ప్రాంగణంలో చెట్టెక్కి.. రైతు ఆత్మహత్యాయత్నం

అనంతపురం కలెక్టరేట్ ప్రాంగణంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. యాడికి మండలం నగురూరుకు చెందిన అహోబిలేశు.. తన భూమిని సర్వే చేయాలని స్పందనలో ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ అధికారుల నుంచి స్పందన లేదు. రెవెన్యూ అధికారులు తన భూమిని సర్వే చేయకుండా అడ్డుకుంటున్నారనే మనస్తాపంతో.. కలెక్టరేట్  ప్రాంగణంలోని చెట్టుకు ఉరేసుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని కలెక్టర్ వద్దకు తీసుకువెళ్తామని రైతుకు నచ్చజెప్పారు.

Published : 05 Jun 2023 15:35 IST

Tags :

మరిన్ని