ఎన్నిసార్లు అడిగినా సమస్య తీర్చరా? అదనపు కలెక్టర్‌పై అర్జీ విసిరిన రైతు!

ఆదిలాబాద్ (Adilabad) కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ రైతు అసహనంతో అర్జీని అధికారులపై విసిరారు. బజార్ హత్నూర్ మండలం బుతాయికి చెందిన రైతు గోవింద్.. తన తండ్రి పేరిట ఉన్న భూమిని మరొకరికి పట్టా చేసి ఇచ్చారని వాపోయారు. ఈ విషయమై పలు మార్లు అధికారులను కలిసినా.. స్పందన లేదని అసహనం వ్యక్తం చేస్తూ.. అర్జీని అదనపు కలెక్టర్ రిజ్వాన్‌పై విసిరి వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆయన్ను బయటకు పంపడంతో వివాదం సద్దు మణిగింది. 

Updated : 15 May 2023 15:35 IST

ఎన్నిసార్లు అడిగినా సమస్య తీర్చరా? అదనపు కలెక్టర్‌పై అర్జీ విసిరిన రైతు!

ఆదిలాబాద్ (Adilabad) కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ రైతు అసహనంతో అర్జీని అధికారులపై విసిరారు. బజార్ హత్నూర్ మండలం బుతాయికి చెందిన రైతు గోవింద్.. తన తండ్రి పేరిట ఉన్న భూమిని మరొకరికి పట్టా చేసి ఇచ్చారని వాపోయారు. ఈ విషయమై పలు మార్లు అధికారులను కలిసినా.. స్పందన లేదని అసహనం వ్యక్తం చేస్తూ.. అర్జీని అదనపు కలెక్టర్ రిజ్వాన్‌పై విసిరి వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆయన్ను బయటకు పంపడంతో వివాదం సద్దు మణిగింది. 

Tags :

మరిన్ని