Farmer: ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు.. ఎమ్మార్వో కాళ్లు పట్టుకున్న రైతు!

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులకు గురవుతున్నామంటూ ఓ రైతు (Farmer).. ఎమ్మార్వో కాళ్లు పట్టుకున్న ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో చోటుచేసుకుంది. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం, మొక్కజొన్నల కొనుగోళ్లలో.. కేంద్రం నిర్వాహకులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో నిరసనకు దిగారు. ధాన్యం తీసుకొచ్చి 20 రోజులైందని.. తేమ లేకున్నా కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సమ్మయ్య అనే రైతు తహాసిల్దార్ గీయాస్ ఉన్నీసాబేగం కాళ్లకు నమస్కారం చేశారు. 

Published : 07 May 2023 17:48 IST

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులకు గురవుతున్నామంటూ ఓ రైతు (Farmer).. ఎమ్మార్వో కాళ్లు పట్టుకున్న ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో చోటుచేసుకుంది. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం, మొక్కజొన్నల కొనుగోళ్లలో.. కేంద్రం నిర్వాహకులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో నిరసనకు దిగారు. ధాన్యం తీసుకొచ్చి 20 రోజులైందని.. తేమ లేకున్నా కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సమ్మయ్య అనే రైతు తహాసిల్దార్ గీయాస్ ఉన్నీసాబేగం కాళ్లకు నమస్కారం చేశారు. 

Tags :

మరిన్ని