Uravakonda: రెవెన్యూ అధికారుల ఎదుటే పురుగు మందు తాగిన రైతులు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో పొలం దారి విషయంలో అధికారులకు, రైతులకు మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రామ పరిధిలోని.. సర్వే నెంబర్ 623లో పొలాలకు దారి లేకపోయినప్పటికీ.. దారి వదలాలంటూ కొందరు ఆధికార పార్టీ నాయకులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా ప్రదేశానికి వెళ్లారు. దారి చదును చేయడానికి వచ్చిన పోలీసు, రెవెన్యూ అధికారులు, వైకాపా నాయకులు, జేసీబీని బాధిత రైతులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు.
Published : 01 Dec 2022 20:17 IST
Tags :