Indira Devi: శోకసంద్రంలో ఘట్టమనేని కుటుంబం.. సితార కన్నీటి పర్యంతం

సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌ బాబు తల్లి ఇందిరాదేవి (Indira Devi)(70) మరణంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, ప్రముఖుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచారు. నానమ్మ మృతితో మహేశ్‌బాబు కుమార్తె సితార కన్నీటి పర్యంతమైంది. ఇందిరాదేవికి తుది నివాళి అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. 

Published : 28 Sep 2022 12:29 IST

Tags :

మరిన్ని