Fire Accident: బాణసంచా గిడ్డంగిలో అగ్ని ప్రమాదం.. ముగ్గురి సజీవ దహనం

తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కువ్వాకుల్లి బాణసంచా గోదాములో జరిగిన అగ్నిప్రమాదంలో.. ముగ్గురు కూలీలు సజీవ దహనమయ్యారు. చనిపోయిన వారిని గూడూరుకు చెందిన ఏడుకొండలు, కువ్వాకుల్లికి చెందిన శంకరయ్య, నాగేంద్రగా గుర్తించారు. బాణసంచా గిడ్డంగి యజమాని వీరరాఘవులుతో పాటు కూలీగా పనిచేస్తున్న కళ్యాణ్‍ కుమార్‍ తీవ్రంగా గాయపడ్డారు. వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఎండల తీవ్రతతోపాటు బాణసంచా తయారీలో జరిగిన పొరపాట్ల వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. 

Published : 31 May 2023 20:42 IST

Tags :

మరిన్ని