Fire Accident: బాణసంచా గిడ్డంగిలో అగ్ని ప్రమాదం.. ముగ్గురి సజీవ దహనం
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కువ్వాకుల్లి బాణసంచా గోదాములో జరిగిన అగ్నిప్రమాదంలో.. ముగ్గురు కూలీలు సజీవ దహనమయ్యారు. చనిపోయిన వారిని గూడూరుకు చెందిన ఏడుకొండలు, కువ్వాకుల్లికి చెందిన శంకరయ్య, నాగేంద్రగా గుర్తించారు. బాణసంచా గిడ్డంగి యజమాని వీరరాఘవులుతో పాటు కూలీగా పనిచేస్తున్న కళ్యాణ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఎండల తీవ్రతతోపాటు బాణసంచా తయారీలో జరిగిన పొరపాట్ల వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
Published : 31 May 2023 20:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!