Fire Accident: తూర్పుగోదావరి జిల్లా కడియం పోలీస్ క్వార్టర్స్‌లో అగ్ని ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా కడియం పోలీస్ స్టేషన్‌ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసుల వివరాల ప్రకారం.. స్టేషన్‌కి ఆనుకుని ఉన్న క్వార్టర్స్‌లో సోమవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను ఆర్పివేశారు. ఘటనాస్థలిని రాజమహేంద్రవరం డీఎస్పీ ఎమ్‌.శ్రీలత, కడియం సీఐ తిలక్, ఎస్ఐ అమీనా బేగం పరిశీలించారు. కొన్నేళ్లుగా ఈ భవనాన్ని పలు కీలక ఆధారాలను భద్రపరిచేందుకు వినియోగిస్తున్నారు. పలు కేసుల్లో పట్టుబడిన గంజాయి, గుట్కా, బెల్లం తదితర వస్తువులు భారీగా ఇక్కడే ఉన్నాయి.

Updated : 25 May 2023 16:59 IST

Fire Accident: తూర్పుగోదావరి జిల్లా కడియం పోలీస్ క్వార్టర్స్‌లో అగ్ని ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా కడియం పోలీస్ స్టేషన్‌ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసుల వివరాల ప్రకారం.. స్టేషన్‌కి ఆనుకుని ఉన్న క్వార్టర్స్‌లో సోమవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను ఆర్పివేశారు. ఘటనాస్థలిని రాజమహేంద్రవరం డీఎస్పీ ఎమ్‌.శ్రీలత, కడియం సీఐ తిలక్, ఎస్ఐ అమీనా బేగం పరిశీలించారు. కొన్నేళ్లుగా ఈ భవనాన్ని పలు కీలక ఆధారాలను భద్రపరిచేందుకు వినియోగిస్తున్నారు. పలు కేసుల్లో పట్టుబడిన గంజాయి, గుట్కా, బెల్లం తదితర వస్తువులు భారీగా ఇక్కడే ఉన్నాయి.

Tags :

మరిన్ని