Duronto Express: దురంతో ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. ప్రయాణికుల పరుగులు

కుప్పం పట్టణం: దురంతో ఎక్స్‌ప్రెస్‌లో స్వల్పంగా మంటలు రావడం కలకలం సృష్టించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం రైల్వేస్టేషన్‌ సమీపంలో చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హవ్‌డా వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌-9 బోగీలో స్వల్పంగా మంటలతో పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్‌ కుప్పం రైల్వేస్టేషన్‌లో రైలును ఆపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు తెలుసుకుని కిందికి దిగి పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. దీంతో తిరిగి రైలు బయల్దేరింది.

Updated : 27 Nov 2022 14:33 IST

Duronto Express: దురంతో ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. ప్రయాణికుల పరుగులు

కుప్పం పట్టణం: దురంతో ఎక్స్‌ప్రెస్‌లో స్వల్పంగా మంటలు రావడం కలకలం సృష్టించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం రైల్వేస్టేషన్‌ సమీపంలో చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హవ్‌డా వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌-9 బోగీలో స్వల్పంగా మంటలతో పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్‌ కుప్పం రైల్వేస్టేషన్‌లో రైలును ఆపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు తెలుసుకుని కిందికి దిగి పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. దీంతో తిరిగి రైలు బయల్దేరింది.

Tags :

మరిన్ని