Telangana news: మల్లూరుగుట్ట దేవాలయం వద్ద అటవీశాఖ అధికారుల జోక్యం..!

ములుగు జిల్లా మల్లూరుగుట్టపై హేమచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద అటవీశాఖ ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వివాదాస్పదంగా మారింది. మల్లూరుగుట్టపై హేమచల లక్ష్మీనరసింహస్వామికి నిత్య పూజలు జరుగుతుంటాయి. వాహనాలలో వచ్చే భక్తులకు ఆలయ సమీపంలోని ఖాళీ స్థలంలో దేవాదాయ పార్కింగ్  ఏర్పాటు చేసింది. ఇన్ని రోజులు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో భూమి ఉండేది. ఇప్పుడు అటవీశాఖ చెక్ పోస్ట్ పెట్టి వాహనాల రుసుము తీసుకోవడానికి ప్రయత్నిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

Published : 11 Dec 2022 12:14 IST
Tags :

మరిన్ని