Road Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

కాకినాడ జిల్లా గండేపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో.. నలుగురు మృతి చెందారు. ఏలూరు జిల్లాకు చెందిన 13మంది కళాకారులు.. ట్రాలీ ఆటోలో అనకాపల్లి జిల్లా కశింకోట పరమటమ్మ తల్లి ఆలయానికి వెళ్తుండగా.. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ట్రాలీ ఆటో ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో ట్రాలీ ఆటోలో ఉన్నవారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో ముగ్గురు చనిపోయారు. మిగితా క్షతగాత్రులంతా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

Published : 16 Nov 2022 15:47 IST
Tags :

మరిన్ని