Tirumala: గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం: గాలి జనార్దనరెడ్డి
కర్ణాటక(Karnataka)లో తాను గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గం నుంచి తన పార్టీని ముందుకు తీసుకెళ్తానని కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధ్యక్షుడు గాలి జనార్దనరెడ్డి(Gali Janardan Reddy) తెలిపారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో గాలి జనార్దనరెడ్డి, కర్ణాటక మంత్రి శ్రీరాములు వేరువేరుగా తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉండటంతో.. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న విషయాన్ని నెల రోజుల్లో వెల్లడిస్తామని చెప్పారు. తితిదే ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Published : 07 Feb 2023 12:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..