నిజాలు నిగ్గుతేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదే: మంత్రి గంగుల
దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తానని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. విదేశాల నుంచి తిరిగొచ్చిన ఆయన బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘దర్యాప్తు సంపూర్ణంగా చేయండి. నిజాలు నిగ్గుతేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదే. నేను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఈడీ అధికారులు వీడియో కాల్ ద్వారా ఫోన్ చేసి ఇంటి తాళాలు తీయమని అడిగారు. నేనే ఇంట్లోని ప్రతి లాకర్ ఓపెన్ చేసి చూసుకొమ్మని చెప్పా. ఈ సోదాల్లో ఎంత నగదు దొరికిందో, ఏమేం స్వాధీనం చేసుకున్నారో ఈడీ అధికారులు చెప్పాలి’’ అని మంత్రి కమలాకర్ డిమాండ్ చేశారు.
Published : 09 Nov 2022 22:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం