నిజాలు నిగ్గుతేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదే: మంత్రి గంగుల

దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తానని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. విదేశాల నుంచి తిరిగొచ్చిన ఆయన బుధవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘దర్యాప్తు సంపూర్ణంగా చేయండి. నిజాలు నిగ్గుతేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదే. నేను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఈడీ అధికారులు వీడియో కాల్‌ ద్వారా ఫోన్‌ చేసి ఇంటి తాళాలు తీయమని అడిగారు. నేనే ఇంట్లోని ప్రతి లాకర్‌ ఓపెన్‌ చేసి చూసుకొమ్మని చెప్పా. ఈ సోదాల్లో ఎంత నగదు దొరికిందో, ఏమేం స్వాధీనం చేసుకున్నారో ఈడీ అధికారులు చెప్పాలి’’ అని మంత్రి కమలాకర్‌ డిమాండ్ చేశారు. 

Published : 09 Nov 2022 22:52 IST

దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తానని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. విదేశాల నుంచి తిరిగొచ్చిన ఆయన బుధవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘దర్యాప్తు సంపూర్ణంగా చేయండి. నిజాలు నిగ్గుతేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదే. నేను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఈడీ అధికారులు వీడియో కాల్‌ ద్వారా ఫోన్‌ చేసి ఇంటి తాళాలు తీయమని అడిగారు. నేనే ఇంట్లోని ప్రతి లాకర్‌ ఓపెన్‌ చేసి చూసుకొమ్మని చెప్పా. ఈ సోదాల్లో ఎంత నగదు దొరికిందో, ఏమేం స్వాధీనం చేసుకున్నారో ఈడీ అధికారులు చెప్పాలి’’ అని మంత్రి కమలాకర్‌ డిమాండ్ చేశారు. 

Tags :

మరిన్ని