Hyderabad: నగరంలో గంజాయి గ్యాంగ్‌లు.. ప్రశ్నించిన వారిపై దాడులు!

హైదరాబాద్ మేడిపల్లి ఠాణా పరిధిలో గంజాయి గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. ఫీర్జాదిగూడ మల్లికార్జున్ నగర్‌లో కొన్ని రోజులుగా పగలు రాత్రి అనే తేడా లేకుండా.. సుమారు 20 మంది యువకులు గంజాయి తాగుతూ హంగామా చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. వీరి అల్లరి భరించలేని కొందరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో స్వయంగా ఆ యువకులను కాలనీ మహిళలు మందలించారు. దీంతో రెచ్చిపోయిన ఆకతాయిలు గంజాయి మత్తులో వారిపై దాడి చేశారు. బాధిత మహిళలు మరోసారి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Published : 10 Jun 2023 17:05 IST

హైదరాబాద్ మేడిపల్లి ఠాణా పరిధిలో గంజాయి గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. ఫీర్జాదిగూడ మల్లికార్జున్ నగర్‌లో కొన్ని రోజులుగా పగలు రాత్రి అనే తేడా లేకుండా.. సుమారు 20 మంది యువకులు గంజాయి తాగుతూ హంగామా చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. వీరి అల్లరి భరించలేని కొందరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో స్వయంగా ఆ యువకులను కాలనీ మహిళలు మందలించారు. దీంతో రెచ్చిపోయిన ఆకతాయిలు గంజాయి మత్తులో వారిపై దాడి చేశారు. బాధిత మహిళలు మరోసారి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Tags :

మరిన్ని