LIC: అదానీ గ్రూప్‌లో.. భారీగా క్షీణించిన ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ

అదానీ గ్రూప్‌ సంస్థల్లో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ తొలిసారి కొన్న ధర కంటే తక్కువకు చేరినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అదానీ గ్రూప్‌ సంస్థల్లో ఎల్‌ఐసీ రూ.30,127 కోట్లు పెట్టుబడి పెట్టగా.. దాని విలువ ఈ ఏడాది జనవరిలో రూ.56,142 కోట్లకు చేరింది. హిండెన్‌బర్గ్‌ రీసెర్చి నివేదిక వెలువడిన తర్వాత అదానీ గ్రూప్‌ సంస్థల మార్కెట్‌ విలువ 60 శాతానికిపైగా హరించుకుపోగా.. ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ సైతం క్షీణిస్తూ వచ్చింది. 

Published : 25 Feb 2023 12:58 IST

Tags :

మరిన్ని