Pratidwani: ఏపీ ప్రభుత్వం వేస్తున్న పన్నులను నోరెత్తకుండా చెల్లించాల్సిందేనా?

ఆదాయం సమకూర్చుకునేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పన్నులు విధించే మార్గాన్నే ఎంచుకుంటోంది. ఇప్పటికే చెత్తపన్ను, ట్రూ ఆప్‌ ఛార్జీల రూపంలో ప్రజల నుండి భారీగా పన్నులు రాబట్టింది. ఈ అనుభవంతో ఇప్పుడు ఇంపాక్ట్‌ ఫీజుల పేరుతో కొత్త ఆదాయ మార్గం  కనిపెట్టింది. రహదారులకు ఇరువైపులా నిర్మించే భవనాలు, నివాసాలపై పన్నులు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై ఎన్ని రకాల పన్నులు విధిస్తోంది? ఎప్పటికప్పుడు కొత్త పన్నులతో ప్రజలపై భారాలు మోపితే... వారి జీవనం సాఫీగా సాగుతుందా? ప్రభుత్వం వేస్తున్న పన్నులను ప్రజలు నోరెత్తకుండా చెల్లించాల్సిందేనా?నేటి ప్రతిధ్వనిలో..

Published : 16 Aug 2022 20:24 IST

Tags :

మరిన్ని