IND vs AUS: భారత్ -ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్టు.. ప్రత్యక్షంగా వీక్షించనున్న ఇరు దేశాల ప్రధానులు

భారత్ -ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్టు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం నుంచి ప్రారంభంకానుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. తద్వారా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించాలని కృత నిశ్చయంతో ఉంది. నాలుగో టెస్టు తొలిరోజు ఆటను ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని అంథోనీ అల్బనీస్‌తో కలిసి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. 

Updated : 08 Mar 2023 20:56 IST

Tags :

మరిన్ని