ind vs ban 1st Test: రెండో రోజు ఆటంతా బౌలర్లదే.. మ్యాచ్‌ హైలైట్స్‌ ఇవిగో..

భారత్‌ - బంగ్లా మధ్య తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది. టీమ్‌ఇండియా బౌలర్ల దెబ్బకు ఆట ముగిసే సమయానికి బంగ్లా 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. క్రీజ్‌లో మెహిదీ మిరాజ్ (16*), ఎబాడట్‌ హోస్సేన్ (13*) ఉన్నారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 31 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్‌దీప్‌ 4, సిరాజ్ 3, ఉమేశ్‌ యాదవ్ ఒక వికెట్ తీశారు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌటైంది. 

Published : 15 Dec 2022 20:21 IST

Tags :

మరిన్ని