IND vs BAN: బౌలర్ల మాయాజాలం.. తొలి టెస్టులో బంగ్లాపై భారత్‌ విజయం

తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 513 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ 324 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌ 188 పరుగుల తేడాతో గెలిచింది. ఐదో రోజు ఆట ప్రారంభమైన 50 నిమిషాల్లోపే బంగ్లాదేశ్‌ కేవలం 52 పరుగులే చేసి చివరి నాలుగు వికెట్లను కోల్పోయి ఓటమిపాలైంది. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఎనిమిది వికెట్‌లు పడగొట్టిన కుల్‌దీప్‌ యాదవ్‌కే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు.

Updated : 18 Dec 2022 15:54 IST

Tags :

మరిన్ని