Rajini: మంత్రి రజని, నేతలకు మధ్య వర్గ విభేదాలు.. వాలంటీర్లకు ఎసరు!

పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చందవరంలో మంత్రి రజని (Vidadala Rajini)కి, స్థానిక నేతలకు మధ్య ఏర్పడిన వర్గ విభేదాలు.. వాలంటీర్ల ఉద్యోగాలకు ఎసరు తెచ్చాయి. విభేదాల కారణంగా నేతలతోపాటు గ్రామానికి చెందిన వాలంటీర్లు కూడా.. మంత్రి నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఫలితంగా వాలంటీర్లను పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి అధికారులు తప్పించారు. ఆ తర్వాత వాలంటీర్లు గ్రామ సచివాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో సచివాలయ సిబ్బంది పింఛన్లు పంపిణీ చేశారు.

Published : 01 May 2023 17:40 IST

పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చందవరంలో మంత్రి రజని (Vidadala Rajini)కి, స్థానిక నేతలకు మధ్య ఏర్పడిన వర్గ విభేదాలు.. వాలంటీర్ల ఉద్యోగాలకు ఎసరు తెచ్చాయి. విభేదాల కారణంగా నేతలతోపాటు గ్రామానికి చెందిన వాలంటీర్లు కూడా.. మంత్రి నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఫలితంగా వాలంటీర్లను పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి అధికారులు తప్పించారు. ఆ తర్వాత వాలంటీర్లు గ్రామ సచివాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో సచివాలయ సిబ్బంది పింఛన్లు పంపిణీ చేశారు.

Tags :

మరిన్ని