YSRCP: తిరువూరు వైకాపాలో ‘కుర్చీ’ కుమ్ములాటలు..!

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు మున్సిపాల్టీలో అధికారం కోసం అధికార వైకాపాలో కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ఛైర్‌పర్సన్‌ పదవి కోసం గతంలో అనుకున్న రెండేళ్ల ఒప్పందం అమలు చేయకపోవడంతో.. అధికార పార్టీ సభ్యులు ఇవాళ్టి కౌన్సిల్ సమావేశానికి డుమ్మా కొట్టారు. మొత్తం 17 మంది అధికార పార్టీ సభ్యులుంటే.. ఛైర్‌పర్సన్‌తో కలిపి 8 మంది మాత్రమే కౌన్సిల్ భేటీకీ హాజరయ్యారు. కోరమ్ లేకపోవడంతో సమావేశం వాయిదా పడింది. అధికార పార్టీలో విభేదాలతో పట్టణంలో అభివృద్ధి కుంటుపడిందని ముగ్గురు ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు.

Published : 31 May 2023 16:54 IST

Tags :

మరిన్ని