Amaravati: 3 రాజధానులతో రాష్ట్రం మూడు ముక్కలయ్యే ప్రమాదం: అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు

మూడు రాజధానులు పేరిట ముఖ్యమంత్రి జగన్ చలికాచుకొంటున్నారని అమరావతి బహుజన ఐకాస కన్వీనర్ పోతుల బాల కోటయ్య విమర్శించారు. మూడు రాజధానుల వల్ల రాష్ట్రం మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రాంతం పైకి మరో ప్రాంతాన్ని ఉసిగొల్పేందుకు.. అమరావతి నుంచి రాజధాని తరలించడం గొడ్డలిపెట్టుగా అభివర్ణించారు. ఈ చర్యలు వలన ఎక్కువగా  నష్టపోయేది బహుజన కులాలు వారేనని వాపోయారు. రైతుల ఉద్యమానికి తలొగ్గి ప్రధాని నరేంద్ర మోదీ ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నారని.. సీఎం జగన్ అయన కంటే ఘనుడా? అని బాల కోటయ్య ప్రశ్నించారు.  

Updated : 07 Nov 2022 10:57 IST

Tags :

మరిన్ని