Tirumala: రోజుకు 80 వేల మందికి.. వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం

తిరుమలలో జనవరి 2న వైకుంఠ ఏకాదశి, 3న ద్వాదశి పర్వదినాలతో పాటు.. పది రోజుల పాటు నిర్వహించే ఉత్తర ద్వార దర్శనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టామన్నారు. వైకుంఠద్వార దర్శనం టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. రోజుకు 80 వేల మంది చొప్పున వివిధ కేటగిరీల భక్తులకు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.

Published : 01 Jan 2023 21:35 IST

Tags :

మరిన్ని