Renu Desai: 18ఏళ్ల విరామం తర్వాత ‘టైగర్‌ నాగేశ్వరరావు’తో రేణు దేశాయ్‌ రీఎంట్రీ

‘బద్రి’, ‘జానీ’ లాంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన నటి రేణూ దేశాయ్‌. ఆమె 18ఏళ్ల విరామం తర్వాత ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రంతో వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. 70వ దశకంలో పేరు మోసిన స్టూవర్ట్‌పురం దొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథతో రూపొందుతోంది. దీన్ని వంశీ తెరకెక్కిస్తున్నారు. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హేమలతా లవణం అనే స్ఫూర్తిదాయకమైన పాత్రలో కనిపించనున్నారు రేణు. 

Published : 29 Sep 2022 16:38 IST

Tags :

మరిన్ని