18 ఏళ్లుగా విమానాశ్రయంలోనే ఆశ్రయం పొందిన వ్యక్తి.. గుండెపోటుతో మృతి

సుమారు 18 ఏళ్లు ఆయనకు విమానాశ్రయమే ఇల్లు అయ్యింది. తన వస్తువులను ఎయిర్ పోర్ట్ లోని ఓ మూల పెట్టుకుని.. అక్కడే బతికారు. 1988 నుంచి 2006 వరకు.. 18 ఏళ్ల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఎయిర్ పోర్ట్ లోనే జీవించిన వ్యక్తి.. ఇప్పుడు అదే విమానాశ్రయంలో మరణించారు. తన అనుభవాలను డైరీలో నిక్షిప్తం చేసుకుంటూ.. పుస్తకాలు చదువుతూ విమానాశ్రయంలో గడిపిన వ్యక్తి.. చివరికి అక్కడే కన్నుమూశారు. ప్రఖ్యాత దర్శకుడు స్టీఫెన్ స్పిల్ బర్గ్‌ను కదలించిన మెహ్రాన్ కరీమీ నస్సేరి గుండెపోటుతో మరణించారు.

Published : 14 Nov 2022 09:16 IST

Tags :

మరిన్ని