KA Paul: మంత్రి పదవి ఇస్తానంటే.. ఎడమ కాలితో తన్నేశా: కేఏ పాల్

ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలని కోరుతూ విజయవాడలో అంబేడ్కర్‌ విగ్రహానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వినతి పత్రం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయన్నారు. రూ.లక్షల కోట్లు పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లినా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అన్ని వర్గాలు ప్రజలు తనను గెలిపించనందుకు బాధ పడుతున్నారన్నారు. 25 ఎంపీలను ఇస్తే కేంద్రాన్ని కదిలిస్తానన్న జగన్.. ఇప్పుడు మోదీ జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంపై తెలుగువాడిగా ఎన్టీఆర్ చూపించిన తెగువ చూపి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలన్నారు.

Updated : 18 Dec 2022 17:00 IST

Tags :

మరిన్ని