CM KCR: దిల్లీలోనే కేసీఆర్‌.. వసంత్‌ విహార్‌లో భారాస కార్యాలయం పనుల పరిశీలన

దిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు వసంత్‌ విహార్‌లో పార్టీ కార్యాలయం నిర్మాణ పనులను కేసీఆర్‌ పర్యవేక్షించారు. ‘తెరాస’ పేరును ‘భారాస’గా మార్చుతూ నిర్ణయం తీసుకున్న తర్వాత తొలిసారి దిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్‌... వసంత్‌ విహార్‌లో జరుగుతున్న కార్యాలయ నిర్మాణ పనులను పర్యవేక్షించి అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కేసీఆర్‌ వెంట మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ సంతోష్‌, ఎమ్మెల్సీ కవిత తదితర నేతలు ఉన్నారు.  

Published : 12 Oct 2022 19:14 IST
Tags :

మరిన్ని