North Korea: కొత్త ఏడాదికి క్షిపణితో స్వాగతం పలికిన ఉత్తర కొరియా..!

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నూతన సంవత్సరానికి తనదైన శైలిలో స్వాగతం పలికారు. ప్రపంచ దేశాలు బాణసంచా పేలుళ్లతో కొత్త ఏడాదిలో అడుగుపెడితే.. కిమ్ మాత్రం క్షిపణి ప్రయోగంతో నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. ఈ ఏడాదిలో అణ్వస్త్రాల తయారీని గణనీయంగా పెంచుతామని కిమ్ ప్రతిజ్ఞ చేశారు. అమెరికా సహా ప్రత్యర్థి దేశాలను ఎదుర్కొనేందుకు సైనిక శక్తిని మరింత పటిష్ఠం చేస్తామని ప్రకటించారు. మరోవైపు కిమ్ చేపట్టిన తాజా క్షిపణి ప్రయోగంపై అమెరికా, దక్షిణ కొరియా దేశాలు మండి పడ్డాయి. 

Published : 01 Jan 2023 15:33 IST
Tags :

మరిన్ని