Kishan Reddy: తెరాస దాడులకు ప్రజలే సమాధానం చెబుతారు: కిషన్‌ రెడ్డి

ఎంపీ ధర్మపురి అర్వింద్‌ నివాసంపై తెరాస కార్యకర్తల దాడిని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఖండించారు. అర్వింద్‌ నివాసానికి వెళ్లిన ఆయన.. దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు, మజ్లిస్‌ను అడ్డుపెట్టుకొని తమపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తెరాస దాడులకు తెలంగాణ ప్రజలే సమాధానం చెబుతారన్నారు. భయపెట్టి, బతిమిలాడి ఇతర పార్టీల నాయకులను తీసుకోవాలనే కోరిక తమకు లేదని కిషన్‌ తేల్చి చెప్పారు. 

Published : 18 Nov 2022 19:58 IST
Tags :

మరిన్ని