Dharmana Prasada Rao: మాజీ సైనికుల పేరిట విశాఖలో మంత్రి ధర్మాన భూదోపిడీ!

విశాఖను రాజధాని చేయాలంటూ మంత్రి ధర్మాన ఇటీవల ఉద్వేగంగా మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర వేదికపై ఉద్రిక్త ప్రసంగాలు చేస్తున్నారు. విశాఖ రాజధాని కోసం రాజీనామాకైనా సిద్ధమని ప్రకటించారు. కానీ ‘సిట్ ’ నివేదిక బయటికొచ్చాకే తెలిసింది.. ధర్మాన తపనంతా విశాఖలో అప్పనంగా కొట్టేసిన భూములపైనే అని! అధికారుల్ని అదిరించి, రికార్డులు మార్పించి.. విశ్రాంత సైనికోద్యోగులకు చెందిన రూ.వందల కోట్ల విలువైన 70 ఎకరాలకు పైగా భూముల్ని తన ఖాతాలో వేసేసుకున్నారు. విశాఖ రాజధానిగా మారితే.. ఆ భూముల విలువ ఒక్కసారిగా రెండు, మూడింతలు కావడం ఖాయం. 

Published : 15 Oct 2022 09:20 IST
Tags :

మరిన్ని