Hyderabad: నడిరోడ్డుపై ఆయిల్‌ డ్రమ్ములు బోల్తా.. ట్రాఫిక్‌కు అంతరాయం

హైదరాబాద్‌ మాసబ్‌ ట్యాంక్‌లోని NMDC వద్ద తెల్లవారుజామున ఆయిల్‌ను తరలిస్తున్న లారీ పల్టీ కొట్టింది. వాహనంలో ఉన్న మినీ ఆయిల్ ట్యాంకర్లు ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయాయి. రోడ్డుపైన చమురు పారింది. ఫలితంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని ఆయిల్ ట్యాంకర్లను తొలగించారు. ఐదు కిలో మీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు, స్థానికులు అంచనా వేస్తున్నారు.

Updated : 07 Jun 2023 15:12 IST

Hyderabad: నడిరోడ్డుపై ఆయిల్‌ డ్రమ్ములు బోల్తా.. ట్రాఫిక్‌కు అంతరాయం

Tags :

మరిన్ని