వైకాపా సర్పంచ్ దాడి.. అవమాన భారం భరించలేక వ్యక్తి బలవన్మరణం!
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం సోమవరం గ్రామంలో సొంత పార్టీ నేతపైనే.. వైకాపా సర్పంచ్, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. అవినీతి అక్రమాలను నిలదీసినందుకు శ్రీను అనే వ్యక్తిపై వైకాపా సర్పంచ్ శోభన్ బాబు, అతని వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దాడికి సంబంధించిన దృశ్యాల్ని గ్రామంలో వైరల్ చేస్తూ అవమానించారు. అవమాన భారం భరించలేక శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు కూడా పట్టించుకోవడం లేదనే మనస్థాపంతో పురుగుల మందు తాగాడు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీను ఇవాళ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Updated : 04 Jun 2023 17:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM