Viral: ‘నా మరణ దిన వేడుకలకు రండి’: బతికుండగానే ఆహ్వానిస్తున్న బాపట్ల జిల్లా వ్యక్తి !

తనకు మరణం ఎప్పుడొస్తుందో ఊహించుకొని.. బతికుండగానే ఆ రోజున ఏటా వేడుక చేసుకోవాలని నిర్ణయించుకున్నారో వ్యక్తి. అంతేకాదు.. ఆహ్వాన పత్రికలూ ముద్రించుకున్నారు. చిత్రమైన నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న ఆ వ్యక్తే డాక్టరు పాలేటి రామారావు. చీరాలకు చెందిన ఆయన తెదేపా హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగానూ ఎన్నికయ్యారు. రామారావు ప్రస్తుత వయసు 63 ఏళ్లు. 75 ఏళ్ల వయసులో అంటే 2034 సంవత్సరంలో చనిపోతానని అంచనా వేసుకొని ఈ సంవత్సరం నుంచి ‘మరణ దినం’ చేసుకుంటున్నట్లు ఆహ్వాన పత్రిక ముద్రించుకున్నారు.

Updated : 17 Dec 2022 16:57 IST
Tags :

మరిన్ని