Andhra News: విశాఖలో.. మద్యం మత్తులో అధికారితో గొడవపడిన వైకాపా మండల పార్టీ అధ్యక్షుడు

విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం పరిషత్ సర్వసభ్య సమావేశానికి వైకాపా మండల పార్టీ అధ్యక్షుడు చెల్లూరి పైడప్పడు మద్యం సేవించి వచ్చారు. పంచడానికి తప్ప అభివృద్ధికి నిధుల్లేవన్నారు. అనంతరంస్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్  బ్యూరో అధికారి పద్మావతితో వాగ్వాదానికి దిగారు. మద్యం షాపులవారే బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా మద్యం సీసాతో పట్టుపడితే రూ.25 వేల వరకు జరిమానా విధించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. 

Published : 13 Aug 2022 15:28 IST
Tags :

మరిన్ని