Telangana News: నాది ‘సోది క్లాస్’ అంటారా?.. అధ్యాపకురాలి ఉగ్రరూపం..!

తరగతి గదిలో విద్యార్థినుల చేష్టలు.. ఓ టీచర్  ఉగ్రరూపానికి కారణమయ్యాయి. కామారెడ్డి జిల్లా మేనూరు జూనియర్ కళాశాలలో ఈ ఘటన  చోటుచేసుకుంది. తరగతిలో అధ్యాపకురాలు పాఠం చెబుతుండగా ఓ విద్యార్థిని ఫోటో తీసి.. దానిని ఇన్‌స్టాలో ‘సోది క్లాస్’ అంటూ పోస్టు చేసింది. విషయం తెలుసుకున్న అధ్యాపకురాలికి ఆగ్రహం వచ్చింది. విద్యార్థినులందరినీ నిలబెట్టి బుద్ధి చెప్పింది. తరగతి గదిలోకి ఫోన్‌లు తెచ్చి.. ఇలాంటి చర్యలకు పాల్పడిన విద్యార్థులు.. అధ్యాపకురాలిని సస్పెండ్ చేయాలంటూ ఆందోళనకు దిగటం గమనార్హం.

Updated : 30 Nov 2022 11:21 IST

Tags :

మరిన్ని