Andhra News: తెదేపా నేత అయ్యన్న ఇంటి వెనుక గోడ కూల్చివేత.. ఉద్రిక్తత

మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నర్సీపట్నంలోని ఇంటిని.. పంట కాలువ ఆక్రమించి కట్టారంటూ.. అర్ధరాత్రి మున్సిపల్ అధికారులు.. ఇంటి గోడను కూల్చేశారు. పోలీసులు ఆయన ఇంటి చుట్టూ భారీగా మోహరించారు. అయ్యన్న కుటుంబసభ్యులు, పెద్ద సంఖ్యలో అనుచరులు చేరుకుని.. కూల్చివేతల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 19 Jun 2022 11:21 IST

Tags :

మరిన్ని