Andhra News: ఆ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోండి: మంత్రి బొత్స

శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లి మండలం కరకంలో నిర్వహించిన గ్రామసభలో ఉపాధ్యాయుల తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పాఠాలు బోధించడం లేదని గ్రామస్థుల ఫిర్యాదుతో ఉపాధ్యాయులపై మండిపడ్డారు. ఉపాధ్యాయులకు అదనపు పనులు అప్పగించడం వల్ల ఇబ్బంది తలెత్తుతోందని వివరణ ఇవ్వగా, మంత్రి మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Published : 16 Aug 2022 18:42 IST
Tags :

మరిన్ని