Harish Rao: రాష్ట్రంలో భాజపాకు డిపాజిట్లు రావు: హరీశ్‌

రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీసేలా ప్రతిపక్షాలు ప్రవర్తిస్తున్నాయని మంత్రి హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో రూ.15 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆస్పత్రి భవనానికి మంత్రి భూమి పూజ చేశారు. తర్వాత జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని ప్రజలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భాజపా పని ఐపోయిందని.. ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. పార్టీ మారేందుకు భాజపా నాయకులు ఎదురుచూస్తున్నారంటూ విమర్శించారు.

Published : 28 May 2023 17:31 IST
Tags :

మరిన్ని