Komuravelli: కొమురవెల్లి మల్లన్నకు బంగారు కిరీటం

రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను.. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో మల్లికార్జునస్వామి కల్యాణోత్సవంలో.. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డితో కలిసి హరీశ్ రావు పాల్గొన్నారు. మల్లన్నకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలతో పాటు రూ.కోటి విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించారు. ఉత్తర తెలంగాణలో జాతరంటే మల్లన్న జాతరే అన్న మంత్రి... వచ్చే ఏడాది మేడమ్మకు, కేతమ్మకు సైతం బంగారు కిరీటాలను చేయిస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. 

Published : 18 Dec 2022 17:16 IST
Tags :

మరిన్ని