Karumuri: ఏయ్ నోరు మూసుకో!.. రైతుపై మంత్రి కారుమూరి ఆగ్రహం

ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో ఓ రైతును దుర్భాషలాడిన పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Karumuri nageswaraRao) మరోసారి అదే తరహాలో మట్లాడారు. అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని పరిశీలించేందుకు ఏలూరు జిల్లా ఉంగుటూరు, నాచుగుంటలో ఆయన పర్యటించారు. రైతులు తమ సమస్యలను మంత్రి వద్ద ఏకరవు పెట్టారు. ఈ క్రమంలో అసహనానికి గురైన మంత్రి.. ఓ రైతును ‘ఏయ్ నోరు మూసుకో..’ అంటూ మండిపడ్డారు. మరో సందర్భంలో రైతులు ఆయనకు సమస్యలు చెబుతుండగా వీడియో చిత్రీకరిస్తున్న విలేకరులను ఆపాలంటూ చేతితో సైగ చేశారు. 

Published : 09 May 2023 12:03 IST
Tags :

మరిన్ని