KTR: ఫ్లోరైడ్ బాధితుడి ఇంట్లో భోజనం చేసిన మంత్రి కేటీఆర్‌

మునుగోడులో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పూర్తయిన తర్వాత మంత్రి కేటీఆర్‌.. అకస్మాత్తుగా శివన్నగూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. నూతనంగా నిర్మించిన అంశాల స్వామి ఇంటికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అక్కడే మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి కేటీఆర్‌ భోజనం చేశారు. గతంలో అంశాల స్వామి పరిస్థితి తెలుసుకొని వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేసిన కేటీఆర్‌.. ప్రభుత్వం నుంచి రెండు పడక గదుల ఇంటి కోసమూ రూ.5.50లక్షలు మంజూరు చేయించారు.

Published : 13 Oct 2022 17:54 IST

Tags :

మరిన్ని